: టీచర్ల భరతం పట్టేందుకు సిద్ధమైన సీఎం యోగి
రోజుకో నిర్ణయంతో పరిపాలనను ఉరుకులు పెట్టిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన దారుణంగా ఉండటంతో... టీచర్ల భరతం పట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. టీచర్ల ఫొటోలను పాఠశాల గోడల మీద అతికించాలని ఆయన ఆదేశించారు. కొంత మంది టీచర్లు తమకు బదులుగా ఇతరులకు తక్కువ జీతాలు ఇచ్చి బడికి పంపుతున్నారని, సొంత వ్యాపారాలు చేసుకోవడమో లేక ఇంట్లో కూర్చోవడమో చేస్తున్నారని... ఇలాంటి వారి వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని యోగి అన్నారు. టీచర్లంతా సమయపాలన పాటించాలని... లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.