: ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం ఎప్పుడూ చెప్పలేదు: మంత్రి లోకేశ్

ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పలేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మాత్రమే సీఎం చెప్పారని, 2018 ద్వితీయార్థంలో ఏ రాష్ట్రానికి ఎన్నికలు లేవని, ఏడాది ముందు ఎన్నికలంటే ఏ రాష్ట్రం సంసిద్ధత చూపబోదని తన అభిప్రాయమని అన్నారు. మూడేళ్లలో రాష్ట్రాన్ని సీఎం ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..టీడీపీ గెలుపు ఖాయమని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News