: బాహుబలిని చూడ్డం కోసం మా డైరెక్టర్ సెలవిచ్చాడు: మంచు మనోజ్

ఇప్పుడెక్కడ చూసినా బాహుబలి ఫీవరే కనిపిస్తోంది. సామాన్య జనాలే కాదు, సినీ జనాలు కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరో మంచు మనోజ్ కూడా ఈ సినిమా చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నాడు. అంతేకాదు, ఈ సినిమాను చూడ్డానికి మనోజ్ కు అతని డైరెక్టర్ సెలవు కూడా ఇచ్చాడట. ఈ విషయాన్ని మనోజ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని మేమిద్దరం కలసి తెలుసుకోవడానికి మా డైరెక్టర్ అజయ నూతక్కి 'ఒక్కడు మిగిలాడు' సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేశాడని చెప్పాడు.

More Telugu News