: మెదక్ జిల్లా పొలాల్లో వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు సమాచారం. గాల్లో ఉన్న సమయంలో సమస్య తలెత్తడంతో, విషయాన్ని కంట్రోల్ రూంకు తెలిపిన పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, దీన్ని కిందకు దించారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఇద్దరు వాయుసేన పైలట్లు ఉండగా, వారిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఇది జడ్ 923 రకానికి చెందిన హెలికాప్టరని అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ పోలీసులు హెలికాప్టర్ కు రక్షణ కల్పించారు.

More Telugu News