: ప్రధానిజీ! మాకు ఒక్క అవకాశం ఇవ్వండి....కశ్మీర్ అల్లర్ల సమయంలో మమ్మల్ని పంపండి: గిరిజనుల సంచలన లేఖ

"మా రక్తం ఉడుకుతోంది. దేశ రక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులపై రాళ్ల దాడులా?... సైనికుల చేతిలో ఆయుధాలున్నా మౌనంగా భరించడమా?....ప్రధాని గారూ! మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కశ్మీర్ లో అల్లర్లు జరిగినప్పుడు రాళ్లు విసిరే యువకులకు ఎదురుగా మమ్మల్ని నిలబెట్టండి....మాకు ఆయుధాలు వద్దు.... వాళ్లు విసిరే రాళ్లే మాకు చాలు... మరోసారి కశ్మీరీ యువకులు రాళ్లు ముట్టుకుంటే ఒట్టు" అంటూ గిరిజనులు రాసిన లేఖ... కలకలం రేపుతోంది.

బీహార్ లోని జాబువా జిల్లాలోని భిల్ తెగకు చెందిన యువకులు ఒడిసెలను ఒడుపుగా ప్రదర్శించడంలో నైపుణ్యం కలవారు. ఒక్కో యువకుడు 50 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఒడిసెలతో గురితప్పకుండా ఛేదించగలరు. ఒక యువకుడు రాయిని విసిరే దూరం కంటే రెండు మూడు రెట్లు ఒడిసెల నుంచి రాళ్లు వేగంగా దూసుకెళ్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని మారు మూల ప్రాంతాల్లో ఈ ఒడిసెల ప్రయోగం ఇప్పటికీ కనిపిస్తుంది. కశ్మీర్ లో సైనికులపై రాళ్ల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసి మనసు రగిలిన యువకులు ప్రధానికి లేఖ రాశారు. ఇలాంటి సమస్య ఎదుర్కొనేందుకు ఒడిసెల దళాన్ని కూడా రూపొందించాలని వారు ప్రధానికి ఈ లేఖలో సూచించారు. 

More Telugu News