: నంద్యాల ఉప ఎన్నికలో మా కుటుంబం నుంచే పోటీ చేస్తారు: అఖిలప్రియ

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. విజయవాడలోని భవానీ ఐ ల్యాండ్ ను ఈ రోజు ఆమె సందర్శించారు. అనంతరం అఖిల ప్రియ మాట్లాడుతూ, ఈ నెల 24న తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ రోజున అభ్యర్థి వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. కాగా, ఐ ల్యాండ్ లో ఫైవ్ స్టార్ హోటళ్లతో పాటు మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

More Telugu News