: పన్నీర్ సెల్వం కుమారుడికి ముందస్తు బెయిల్ మంజూరు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన సోదరుడు రాజాలకు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆర్కే నగర్ ఉపఎన్నిక సందర్భంగా శశికళ వర్గీయులు, పన్నీర్ సెల్వం వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ కుమారుడు, సోదరుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా... వీరిద్దరికీ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. 

More Telugu News