: భువనేశ్వర్ లో ప్రధాని రోడ్ షో...పోటెత్తిన జనం

ఒడిశాలో అధికారం సొంతం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు ప్రారంభించింది. ఒడిశాలో జరుగుతున్న కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అనంతరం ఆయన రోడ్ షో నిర్వహిస్తూ కార్యవర్గ సమావేశాల ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకిరువైపులా భారీ ఎత్తున జనం నిలబడి ఆయనకు స్వాగతం పలుకుతూ అభివాదం చెప్పారు. ప్రధానిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు. దీంతో బీజేపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

More Telugu News