: రెండు వికెట్లు తీసిన సన్ రైజర్స్...ఉతప్ప, మనీష్ పాండే బ్యాటింగ్

కోల్ కతా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 10లో 14 వ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతాకు సన్ రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ శుభారంభం ఇచ్చాడు. గత మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి రాణించిన విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ (6) ను మూడో ఓవర్ రెండో బంతికి బౌల్డ్ చేశాడు. అనంతరం కెప్టెన్ గౌతమ్ గంభీర్ (15) ను ఆరో ఓవర్ నాలుగో బంతికి రషీద్ ఖాన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రాబిన్ ఊతప్ప (37) కు మనీష్ పాండే (9) జత కలిశాడు. వీరిద్దరూ కోల్ కతా ఇన్నింగ్స్ కి మరమ్మతులు చేస్తున్నారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తొలి పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. 

More Telugu News