: హీరోయిన్లు బికినీలు వేసుకుంటే తప్పులేంది.. టీవీలో మేము ఈ మాత్రం కనిపిస్తే తప్పా?: యాంకర్ రష్మి

నాన్ వెజ్ జోకులతో, హాట్ లుక్స్ తో జబర్దస్త్ ప్రోగ్రాంను రక్తి కట్టిస్తోంది హాట్ యాంకర్ రష్మి. ఈ కార్యక్రమం ద్వారానే ఆమె బాగా పాప్యులర్ అయింది. రష్మి మాత్రమే కాదు... అనసూయ, శ్రీముఖిలాంటి యాంకర్లు కూడా ఈ రూట్ లోనే వెళ్తున్నారు. వీరు వేసుకుంటున్న దుస్తులు, వీరి ప్రోగ్రాంలలోని వల్గారిటీపై కామెంట్లు వస్తున్నా... వీరు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఈ క్రమంలో రష్మి మాట్లాడుతూ, పెద్ద పెద్ద హీరోయిన్లు బికినీలు వేసుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరని... తాము మాత్రం బుల్లి తెరపై ఈ మాత్రం కనిపించినా విమర్శలు చేస్తున్నారని మండిపడింది. వెండితెరపై హీరోయిన్లంతా చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారని చెప్పింది. తాము ఈ మాత్రం ట్రెండీగా కనిపించడంలో తప్పులేదని తెలిపింది. 

More Telugu News