: రూ.1,590కు కోటి రూపాయలు గెల్చుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థిని.. మోదీ చేతుల మీదుగా ప్రదానం

న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు న‌రేంద్ర మోదీ స‌ర్కారు లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్‌ వ్యాపార యోజన పేరిట అవార్డులు ఇస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అవార్డులు గెలుచుకున్న వారికి భార‌త‌ రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు నాగపూర్‌లో ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. లక్కీ గ్రాహక్‌ యోజన్‌ కింద అవార్డుకు ఎంపికైన‌ లాతూర్‌కి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని శ్రద్ధ మోహన్ (20) కు మోదీ కోటి రూపాయ‌ల బ‌హుమ‌తి అందించారు.

మొబైల్‌ ఈఎంఐ పేమెంట్ రూ.1,590ను రూపే యాప్‌ ద్వారా చెల్లింపు జ‌రిపి ఆమె బ‌హుమ‌తి గెలుచుకుంది. ఇక రెండవ బహుమతి రూ. 50 లక్షలను గుజరాత్‌కు చెందిన టీచ‌ర్‌ హార్దిక్‌ కుమార్‌ (29) అందుకున్నారు. ఆయ‌న రూపే కార్డు ద్వారా రూ.1110 బిల్లు చెల్లించారు. డిజి ధన్‌ వ్యాపార యోజన కింద మొదటి బహుమతిగా రూ. 50 లక్షలను జీఆర్‌టీ జ్యువెల్లరీ వ్యాపారి ఆనంద్‌ అనంత పద‍్మనాభన్ అందుకున్నారు. ఆయ‌న‌ తమిళనాడులోని తాంబరానికి చెందిన వ్యాపారి. ఆయ‌న‌ రూ.300  పేమెంట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించినందుకు గానూ ల‌క్కీ వ్యాపారిగా ఎంపిక‌య్యారు. ఈ కేటగిరీలో రెండవ బహుమతిని రాగిణి రాజేంద్ర ఉత్తేకర్ అందుకున్నారు. ఆమెకు మోదీ రూ. 25 లక్ష‌లు అందించారు. ఆమె మ‌హారాష్ట్రలో బ్యూటీ పార్లర్ నిర్వ‌హిస్తూ.. క‌స్ట‌మ‌ర్ నుంచి రూ.510 స్వీకరించినందుకుగానూ రెండవ బహుమతికి ఎంపికైంది.

More Telugu News