: అమితాబ్ కు ఆర్థికశాఖ, షారుఖ్ కు రైల్వే శాఖ ఇవ్వాలి: ఆలియా భట్

బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ కు ఆర్థిక శాఖ, షారుఖ్ ఖాన్ కు రైల్వే శాఖ ఇస్తే బాగుంటుందని హీరోయిన్ ఆలియా భట్ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లు 'మహారాష్ట్రియన్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలియా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంలో బాలీవుడ్ నటులు కూడా కొన్ని మంత్రి పదవులు చేపడితే బాగుంటుందని చెప్పింది.

దీంతో, ఏయే నటులకు ఏయే శాఖలు ఇస్తే బాగుంటుందో చెప్పాలంటూ ఆలియాను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ కు ఆర్థిక శాఖ ఇవ్వాలని... రైలు సన్నివేశాల్లో బాగా ఫేమస్ అయిన షారుఖ్ ఖాన్ కు రైల్వే శాఖ ఇస్తే బాగుంటుందని ఆమె సరదాగా చెప్పింది. అంతేకాదు, మహిళలకు అండగా నిలబడే కంగనా రనౌత్ కు మహిళా సంక్షేమ శాఖను ఇవ్వాలని తెలిపింది. 

More Telugu News