: మున్సిపాలిటీ ఉపఎన్నికల్లో సైకిల్ జోరు.. డీలా పడిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంది. హిందూపురం 9వ వార్డులో 939 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బోయ శాంతి విజయం సాధించారు. చిత్తూరు 38వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి వసంత కుమార్ వైకాపా అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ 31వ వార్డు, మాచర్ల 15వ వార్డులో టీడీపీ గెలవగా, 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఉప ఎన్నిక జరగ్గా అన్నింటిలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. మంగళగిరి మున్సిపాలిటీ 31వ వార్డులో వైసీపీ అభ్యర్థి రమణయ్య గెలుపొందారు. 

More Telugu News