: రైలులో ముంబై చేరుకున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్

వివాదస్పద శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో ముంబై చేరుకున్నారు. ఆయనపై గత నెల 23న ఎయిరిండియా నిషేధం విధించిన అనంతరం పార్లమెంటు సమావేశాలకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన ఆయన ఇంతవరకు సాధారణ పాసింజర్ విమానాల్లో ప్రయాణించలేదు. పార్లమెంటు చర్చ అనంతరం క్షమాపణలు చెబుతూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాయడంతో ఆయనపై నిషేధాన్ని ఎయిరిండితో పాటు పలు విమానయాన సంస్థలు ఎత్తివేశాయి. అయితే ఆయన ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిసేందుకు ఢిల్లీ నుంచి ముంబైకి రాజధాని ఎక్స్ ప్రెస్ లో చేరుకున్నారు. కాగా, నిషేధం ఎత్తివేసిన అనంతరం ఎయిరిండియా సిబ్బంది పిచ్చివాళ్లంటూ ‌ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News