: నేను ఒక్క టికెట్ కూడా బుక్ చేయలేదు... మీడియా ఏడు టికెట్లు రద్దు చేసినట్టు చెబుతోంది: రవీంద్ర గైక్వాడ్
తనపై ఎయిరిండియా బ్యాన్ విధించిన అనంతరం ఇతర విమానయాన సంస్థలు కూడా బ్యాన్ విధించాయని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తెలిపారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, ఎయిరిండియా విమానంలో ఘటన చోటుచేసుకున్న అనంతరం 8 రోజుల వరకు మీడియా తనను కనుగొనలేకపోయిందని ఎద్దేవా చేశారు. అలాంటి మీడియా తాను తీసుకున్న టికెట్లు ఏడు సార్లు రద్దయ్యాయంటూ కథనాలు ప్రచురించిందని చెప్పారు. తనపై బ్యాన్ విధించిన తరువాత తాను విమానాల్లో వెళ్లే ప్రయత్నం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా చెబుతున్న ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆయన తెలిపారు.