: ‘కాంగ్రెస్’ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత ఏకే వాలియా

కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత, మాజీ మంత్రి ఏకే వాలియా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు టికెట్ కేటాయింపులపై అసంతృప్తి చెందిన వాలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వాలియా మాట్లాడుతూ, డబ్బులకు పార్టీ టికెట్లను కాంగ్రెస్ అమ్ముకుంటోందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. అంతేకాకుండా, పార్టీలో తాను సీనియర్ నేతను అని, తన మాటను ఎవరూ వినడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నాడు ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ ప్రభుత్వంలో వాలియా కీలక బాధ్యతలు చేప్టటారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాలియా రాజీనామా చేయడంపై పార్టీలో చర్చనీయాంశమైంది.

More Telugu News