: ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసు: ఎమ్మెల్యే ఆలపాటి రాజా

ఏపీ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని సీనియర్ నేతలు, ఆశావహులు తమదైన శైలిలో ఇప్పటికే విమర్శలు, నిరసనలు, చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా స్పందించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో సీఎం చంద్రబాబుకు తెలుసని అన్నారు. అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని, రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. 

More Telugu News