: సమర్థవంతమైన వారినే మంత్రులుగా తీసుకోవాలి: జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలువురు ఎమ్మెల్యేలు, పదవీగండం ఉన్న మంత్రులు భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ఇమేజ్ ఉన్న వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని అన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్కు మంత్రి పదవి ఇవ్వాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకోవాలని తాను చంద్రబాబుకు తెలిపానని అన్నారు. అయితే, చంద్రబాబు స్పందిస్తూ అన్నీ నాకు తెలుసు... చూసుకుంటామని అన్నారని దివాకర్రెడ్డి అన్నారు.