: భారత రాయబారికి సమన్లు జారీ చేసిన నైజీరియా

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో తమ జాతీయులపై జరిగిన దాడులకు నిరసనగా నైజీరియా తమ దేశంలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. నైజీరియా విదేశాంగ శాఖ సమన్లు జారీ చేయడంతోపాటు నిందితులపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. గత సోమవారం నోయిడాలో నలుగురు నైజీరియన్లపై స్థానికులు దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా ఓ టీనేజర్ మత్తు పదార్థాలను అధికంగా సేవించి ప్రాణాలు కోల్పోగా, దానికి కారకులు వీరేనని స్థానికులు సందేహించి దాడికి పాల్పడ్డారు. నైజీరియన్లపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదని, గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నైజీరియా డిమాండ్ చేసింది.

More Telugu News