: మిర్చి ఘాటు .. జగన్ కు దగ్గు, తుమ్ములు!

గుంటూరు మిర్చి యార్డులో రైతులతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, నకిలీ విత్తనాలు మొదలైన సమస్యలపై  రైతులు ఏకరువు పెడుతున్నారు. అయితే, మిర్చి ఘాటు మూలంగా వచ్చే కోరు ఒక రేంజ్ లో ఉండటంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కారణంగా జగన్ కు దగ్గు, తుమ్ములు తగులుకున్నాయి. దీంతో, తన చేతిలో కర్చీప్ ను జగన్ అడ్డుపెట్టుకున్నారు. ఒక చేతిలో కర్చీప్, మరో చేతిలో మైకుతో ఉన్న జగన్, మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.  

More Telugu News