: టీడీపీ అంటే టీఆర్ఎస్ కు భయం.. అందుకే సస్పెండ్ చేశారు!: టీడీపీ నేత రావుల ఫైర్
టీడీపీ నేతలను బెదిరించి టీఆర్ఎస్ లోకి లాక్కున్నారని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. టీఆర్ఎస్ కు టీడీపీ అంటే భయమని, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను సభలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్దంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో అప్పులు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రాష్ట్ర బడ్జెట్ మేడిపండును తలపిస్తోందని ఆయన దుయ్యబట్టారు.