: ప్రాణం తీసిన చికెన్ ముక్క.. హైదరాబాద్‌లో విషాదం!

గొంతులో ఇరుక్కుపోయిన చికెన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌కు చెందిన నిర్మల, కుమారస్వామి (48) దంపతులు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కుమారస్వామి ఈనెల 16న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. చికెన్ కూరతో చపాతీ తింటుండగా ఒక్కసారిగా చికెన్ ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే నీళ్లు తాగిన ఆయన కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను వైద్యులు బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించడంతో కుమారస్వామి మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News