: పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి సొంతం అన్నట్లు మాట్లాడుతున్నారు!: జ‌గ‌న్ విమ‌ర్శ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రసంగం చేసిన అనంత‌రం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి సొంతం అన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. గ‌తంలో తొమ్మ‌దేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టుకి రూపాయి కూడా ఖర్చుపెట్ట‌లేదని ఆయ‌న అన్నారు. ఈ రోజు పోల‌వ‌రం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు హోదా ఉంద‌ని, కానీ చంద్ర‌బాబు స‌ర్కారు త‌రువాత వ‌చ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స‌ర్కారు పోల‌వ‌రంకు సంబంధించిన ఎన్నో ప‌నులు పూర్తి చేసింద‌ని చెప్పారు. అందుకోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని చెప్పారు. ఈ మూడేళ్ల కాలంలో 3300 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టామ‌ని చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం సిగ్గుప‌డాల్సిన విష‌యమ‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబుకి పోల‌వ‌రంపై సరైన ధ్యాస లేద‌ని అన్నారు.

More Telugu News