: మహిళా ఇంజినీర్‌పై అసభ్య మెసేజ్‌లు పెట్టిన 45 మంది బీఎస్ఎన్ఎల్ అధికారులపై కేసు

వాట్సాప్ గ్రూపులో తమ సంస్థకు చెందిన మహిళా ఇంజినీర్‌పై అసభ్య పోస్టింగులు పెట్టిన 45 మంది అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు తూత్తుకుడిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని అధికారులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అదే గ్రూపులో ఉన్న ఇంజినీరు విజయలక్ష్మి వ్యక్తిగత విషయాలపై జూలై 30, 2016న పలు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విజయలక్ష్మి కుమారుడు తూత్తుకుడి జేఎం కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 13 మంది మహిళా అధికారులు సహా 49 మందిపై బుధవారం కేసులు నమోదు చేశారు.

More Telugu News