: మహిళలతో సమానంగా పురుషులకూ 26 వారాల పితృత్వ సెలవులు ఇచ్చేస్తున్న సంస్థ!

గర్భం దాల్చిన మహిళలకు ఎన్నో కంపెనీలు మాతృత్వ సెల‌వులు ఇస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, వారితో స‌మానంగా పురుషులకు కూడా పితృత్వ సెల‌వులు ఇచ్చేస్తోంది స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ తయారీ సంస్థ ఐకియ ఇండియా. భారత్‌లోని తమ సంస్థలో ప‌నిచేస్తోన్న పురుషుల‌కు కూడా 26 వారాల పేరెంటల్‌ లీవ్‌ ఇస్తున్నట్లు తెలిపింది. త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తోన్న‌ పురుషులు, స్త్రీలకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెల‌వులు ఇస్తున్నట్లు ఆ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. అంతేకాదు, సరోగసీ, దత్తత మార్గాన్ని అనుసరించిన వారికి కూడా ఈ సెల‌వులు ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు మహిళలకు మాతృత్వ సెలవులతో పాటు, మరో 16 వారాల పాటు మహిళలు పనిగంటలను సగానికి తగ్గించుకునే వీలు కూడా కల్పిస్తున్న‌ట్లు చెప్పారు.

More Telugu News