: బీజేపీ ఘన విజయంతో మతకల్లోలాల భయం... సంబరాలపై పోలీసుల నిషేధం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టినా బీజేపీని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో అత్యంత సున్నిత ప్రాంతమైన ముజఫర్ నగర్ లో ఓట్ల లెక్కింపు అనంతరం... విజయం సాధించిన అభ్యర్థులు ఎలాంటి ఊరేగింపులు నిర్వహించరాదంటూ జిల్లా పోలీసు అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మతకల్లోలాలు చెలరేగే అవకాశం ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నారు. ఎవరైనా తమ ఆదేశాలను మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News