: కేరళ పీసీసీ అధ్యక్ష పదవికి వీఎం సుధీరన్‌ రాజీనామా

అనారోగ్య కారణంతో కేరళ పీసీసీ అధ్యక్ష పదవికి వీఎం సుధీరన్‌ రాజీనామా చేశారు. గతవారం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వెళ్లిన ఆయ‌న ప్ర‌మాదానికి గురి కావ‌డంతో ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఢిల్లీలోని 10 జనపథ్‌ కు సన్నిహితంగా మెలిగే ఆయ‌న‌ రాజీనామా చేయ‌డం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి గ‌ట్టి ఎదురుదెబ్బే. 2014లో ఆయ‌న ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడ‌య్యారు. అయితే, ఆ స‌మ‌యంలో ఆయ‌నను కేర‌ళ‌ పీసీసీ అధ్యక్షుడిగా నియ‌మించ‌డం ప‌ట్ల అప్పటి ముఖ్య‌మంత్రి ఓమెన్ చాందీ, అప్పటి రాష్ట్ర‌ పీసీసీ అధ్యక్షుడు రమేశ్‌ చెన్నితల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ పలుసార్లు కేరళ అసెంబ్లీకి, పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.

More Telugu News