: సౌదీ రాజు సల్మాన్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన మలేషియా

తమ దేశంలో పర్యటనకు వచ్చిన సౌదీ రాజు సల్మాన్ ను హత్య చేసేందుకు హౌతీ రెబల్ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు చేసిన పెను కుట్రను భగ్నం చేసినట్టు మలేషియా వెల్లడించింది. నగర శివార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఈ విషయం వెల్లడైందని, వీరికి మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధాలున్నాయని మలేషియా ఐజీ ఖలీద్ అబూబకర్ తెలిపారు. వీరి నుంచి పెద్ద ఎత్తున అమెరికన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ట్రక్కులో బాంబు పెట్టి సౌదీ రాజును హత్య చేయాలన్నది వీరి అభిమతమని వివరించారు. కాగా, యమన్ కేంద్రంగా హౌతీ రెబల్ గ్రూప్ పని చేస్తుండగా, కింగ్ సల్మాన్ ను చంపేందుకు వీరు మలేషియాకు వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News