: నేను కలిసిన సీఎంలలో ఎంతో నిరాడంబరుడు అఖిలేష్!: యూపీ సీఎంపై కేటీఆర్ ప్రశంసలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తాను కలిసిన ముఖ్యమంత్రుల్లో తనకు చాలా నచ్చిన వ్యక్తి, నిరాడంబరుడు అఖిలేష్ యాదవ్ అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘రాజకీయాలను పక్కన పెడితే, యూపీ ఎన్నికలు ముగిశాయి. నేను కలిసిన సీఎంలలో ఎంతో నిరాడంబరుడు, నాకు ఇష్టమైన వ్యక్తి అఖిలేష్ యాదవ్’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అఖిలేష్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. 

More Telugu News