: రాజధాని రైతులు పిలుస్తున్నా ఆగకుండా వెళ్లిపోయిన జగన్!

అమరావతి రైతులను వైసీపీ అధినేత జగన్ నిరాశపరిచారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా, అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతులు విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ లతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ విందుకు ప్రతిపక్ష నేత జగన్ ను కూడా రైతులు ఆహ్వానించారు. అయినా, ఆయన విందుకు గైర్హాజరయ్యారు. ఆయనను రైతులు పిలుస్తున్నప్పటికీ, ఆగకుండా వాహనంలో వెళ్లిపోయారు. దీంతో రైతులు కొంచెం నిరాశకు లోనయ్యారు. 

More Telugu News