: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య !

బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాధ ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి హాస్టల్ వార్డెన్, తోటి విద్యార్థినులు చెప్పిన సమాచారం ప్రకారం, ఇటీవల మంత్లీ టెస్టులు నిర్వహించారు. అవి బాగా రాయలేకపోయానని ఆమె తరచుగా బాధపడుతుండేది. ఈ క్రమంలో కొద్దిరోజులు ఇంటికి వెళ్లి వచ్చింది. అయినప్పటికీ, ఆమెలో ఆందోళన తగ్గలేదు.
 
దీంతో, ఈ రోజు ఉదయం తన స్నేహితులతో సరదాగా గడిపిన రాధ, తన మనసు బాగోలేదని తన మిత్రులకు చెప్పి, మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత తోటి విద్యార్థినులు ఆ గది వద్దకు వెళ్లారు. తలుపు వేసి ఉండటంతో, కిటికీలో నుంచి చూసిన విద్యార్థులు.. రాధ ఉరి వేసుకుని ఉండటం గుర్తించారు. కాగా, నల్గొండ జిల్లా నిడమానూరు మండలం మర్లగడ్డ క్యాంప్ రాధ స్వస్థలం అని తెలుస్తోంది.

More Telugu News