: వెలగపూడి సచివాలయానికి గుర్రంపై వచ్చి హల్ చల్... భద్రతాలోపంపై అధికారుల మండిపాటు

నిత్యమూ వీఐపీలు, వీవీఐపీలు తిరుగుతుండే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో భద్రతా సిబ్బంది వైఫల్యం బయటపడింది. ఓ వ్యక్తి ఏకంగా తన గుర్రాన్ని వేసుకుని సెక్రటేరియట్ కు వచ్చి హల్ చల్ చేశాడు. అందరూ చూస్తుండానే తన అశ్వాన్ని అటూ ఇటూ దౌడు తీయించాడు. దీన్ని ఆలస్యంగా గమనించిన పోలీసులు, అతన్ని దూరంగా పంపారు. సచివాలయం ప్రాంతంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఉన్నతాధికారులు మండిపడ్డారు. సచివాలయం ముందు గుర్రం తిరుగాడుతున్న దృశ్యాలను ప్రధాన టీవీ చానళ్లు ప్రసారం చేశాయి.

More Telugu News