: మరికొన్ని గంటల్లో ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏపీలో 1435, తెలంగాణలో 1291 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్-3  ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు.

More Telugu News