: కేవలం 20 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్.. సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల!
కేవలం 20 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ ఎక్కేలా చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘మీజూ’ సరికొత్త స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. ‘సూపర్ ఎం ఛార్జ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ను వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) సందర్భంగా సదరు కంపెనీ లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 7 ప్లస్ కన్నా 11 రెట్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సరికొత్త టెక్నాలజీని వినియోగించి ఈ స్మార్ట్ఫోన్ ను తయారు చేసినట్లు చెప్పారు. అంతేగాక, ఈ స్మార్ట్ఫోన్ అత్యంత భద్రమైనదని, ఎక్కువ సేపు కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్ఫోన్ను ఛార్జ్ చేసే సమయంలో బ్యాటరీ కూడా వేడెక్కదట.