: ఆర్థిక శాఖను బదిలీ చేయాలన్న పళనిస్వామి.. ఓకే చెప్పిన గవర్నర్

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన వద్ద ఉన్న ఓ శాఖను మరో మంత్రికి బదిలీ చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో 19 కీలక శాఖలను పళనిస్వామి తనవద్దే ఉంచుకున్నారు. తన వద్ద ఉన్నఆర్థిక, పరిపాలన సంస్కరణల శాఖ బాధ్యతలను ఇప్పుడు మరోమంత్రికి ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారు. దీంతో ఆ శాఖను మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌కు బదిలీ చేయాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్‌రావును కోరారు. గవర్నర్ వెంటనే ఓకే చెప్పి ఆ శాఖను జయకుమార్‌కు బదిలీ చేశారు.

More Telugu News