: నాకు మరో ఛాన్స్ ఇవ్వండి సార్!: గవర్నర్ తో పన్నీర్ సెల్వం!

నిన్న అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో తమిళనాడు సీఎం పళనిస్వామి నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం వర్గం తమ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావుతో పన్నీర్ ఈరోజు భేటీ అయ్యారు. అసెంబ్లీలో మరోసారి బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న అసెంబ్లీలో పళనిస్వామి బలపరీక్ష సమయంలో డీఎంకే సభ్యులు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. రహస్య ఓటింగ్ కు డిమాండ్ చేస్తూ సభాపతిపై కాగితాలు విసరడం, డీఎంకే సభ్యులు స్పీకర్ చైర్ లో కూర్చోవడం తెలిసిందే.

More Telugu News