: ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మిగిలిన శ్రేయాస్ అయ్యర్

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా-ఏ జట్ల మధ్య జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్, ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం వేచి చూస్తున్న అయ్యర్, మిగతా ఆటగాళ్లు విఫలమైన వేళ, ఏకంగా 150 పరుగులు దాటాడు. మూడవ రోజు లంచ్ విరామ సమయానికి 186 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సులతో 166 పరుగులతో ఉండగా, అతనికి టెయిలెండర్ కె.గౌతమ్ 65 పరుగులతో సపోర్టుగా నిలిచాడు.

ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 127 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 469 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, భారత జట్టు ప్రస్తుతం 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. ఓపెనర్ హర్వాద్కర్ 3, పంచాల్ 36, బౌనీ 25, పాండ్యా 19, ఆర్ఆర్ పంత్ 21, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో బర్డ్, లయాన్ లకు చెరో రెండు, మార్ష్, ఓ కీఫీకి చెరో వికెట్ దక్కాయి.

More Telugu News