: జూపల్లిది ఫోర్ ట్వంటీ చరిత్ర: ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

మంత్రి జూపల్లి పై కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జూపల్లి గత చరిత్ర తెలిస్తే తెలంగాణ ప్రజలు అతనిని అసహ్యించుకుంటారని అన్నారు. దేవుడి మాన్యాన్ని కాజేసిన దగుల్బాజీ జూపల్లి అని ఆయన చెప్పారు. జూపల్లిది లూటీలు, నేరాలు చేసిన ఫోర్ ట్వంటీ చరిత్ర అని ఆయన విమర్శించారు.

ప్రూడెన్షియల్ బ్యాంకును ముంచిన చరిత్ర జూపల్లిదని ఆయన తెలిపారు. బ్యాంకు లూటీ అంశంలో సొంత గ్రామ ప్రజలు తరిమికొడితే హైదరాబాదు పారిపోయిన చరిత్ర జూపల్లిదని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాదులో తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని హుసేన్ సాగర్లోకి తోసి చంపిన ఆరోపణలు జూపల్లిపై వున్నాయని ఆయన తెలిపారు. మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని, పాలమూరు కాల్వకు నిధుల అంచనాల పెంపు వెనుక అవినీతిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. తాను జూపల్లిలా నీతిమాలిన రాజకీయాలు చేయడం లేదని, తన జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని, దానితోనే అంతమవుతుందని ఆయన చెప్పారు. 

More Telugu News