shashikala nataraja: ముచ్చటగా మూడోసారి.. ఎమ్మెల్యేల‌ను ఉంచిన రిసార్టుకు బ‌య‌లుదేరిన శ‌శిక‌ళ‌

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ దూకుడు పెంచిన శ‌శిక‌ళ తాజాగా మ‌రోసారి గోల్డెన్ బే రిసార్టుకు బ‌య‌లుదేరారు. ఇప్ప‌టికే ఆమె రెండు సార్లు అక్క‌డకు వెళ్లి త‌మ ఎమ్మెల్యేల‌తో మంత‌నాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ రోజు పోయెస్ గార్డెన్‌లోని త‌న నివాసంలో త‌మ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం ఆమె కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మ‌రో 24 గంటల్లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తించాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు అన్నాడీఎంకే నేత‌లు తాము శాంతియుత నిర‌స‌న చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ అంశంపై చ‌ర్చించ‌డానికే శ‌శిక‌ళ గోల్డెన్ బే రిసార్టుకి బ‌య‌లుదేరిన‌ట్లు తెలుస్తోంది. మొద‌ట రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చించిన ఆమె ఇప్పుడు నేరుగా చ‌ర్చించేందుకే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

More Telugu News