: మీడియా పై శశికళ వర్గీయుల దాడి!

తమిళనాడులోని కువత్తూర్ లో మీడియాపై శశికళ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గోల్డెన్ బే రిసార్ట్ బయట ఉన్నశశికళ వర్గం నేతలు మీడియాపై దాడి చేశారని, ఈ దాడిలో చాలామంది జర్నలిస్టులకు గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వారిలో ఒక మహిళా జర్నలిస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. దాడిని నిరసిస్తూ
జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.

More Telugu News