: మహిళలను నేనెప్పుడూ అగౌరవ పరచలేదు: స్పీకర్ కోడెల

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతమైందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకే సదస్సు ఏర్పాటు చేశామని, వ్యక్తిగతంగా, రాజకీయంగా మహిళలకు సముచిత స్థానం ఇచ్చామని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కడివెడు పాలల్లో ఒక చుక్క విషం పడితే చాలు సర్వనాశనమవుతుందని, అలాగే, సదస్సును చెడగొట్టేందుకు చిన్న ప్రయత్నం చేశారని, అయితే, ఆ అడ్డంకులను దాటుకుని సదస్సు నిర్వహిస్తున్నామని కోడెల పేర్కొన్నారు. మహిళలపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని, తానెప్పుడూ వారిని కించపరచలేదని, తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కోడెల మండిపడ్డారు.

More Telugu News