: శశికళ వర్గం కొత్త ప్లాన్ .. సీఎం అభ్యర్థిగా సెంగొట్టయన్?

అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సీఎం పీఠం కోసం పోరాడుతున్న తరుణంలో ఆమె వర్గీయులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రజల్లో శశికళకు అంత అనుకూలత లేకపోవడంతో, సీఎం అభ్యర్థిగా సెంగొట్టయన్ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో శశికళపై వ్యతిరేకత తగ్గే వరకు సెంగొట్టయన్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని చిన్నమ్మ వర్గీయులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, శశికళకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో దాచి ఉంచిన విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు శశికళ కాసేపటి క్రితం అక్కడికి వెళ్లారు. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను గవర్నర్ ఎదుట ప్రవేశపెట్టేందుకు శశికళ వ్యూహ రచన చేసినట్టు సమాచారం. 

More Telugu News