: రిసార్ట్స్ లో ఉన్నది 92 మంది ఎమ్మెల్యేలే.. అవకాశం వస్తే పన్నీర్ వైపు దూకేందుకు 20 మంది సిద్ధం

శశికళ క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా క్షేమంగానే ఉన్నట్టు వారి వద్ద నుంచి అధికారులు లేఖలు తీసుకుంటున్నారు. రిసార్ట్స్ లో 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో కూడా 20 మంది ఆనందంగా లేరని... అవకాశం వస్తే అక్కడ నుంచి జంప్ అయి, పన్నీర్ శిబిరంలో చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ 20 మందిని బుజ్జగించే పనిలో శశికళ వర్గం ఉందని తెలుస్తోంది. శశికళ కూడా స్వయంగా రిసార్ట్స్ కు వెళుతున్న నేపథ్యంలో, వీరందరితో ఆమె మాట్లాడనున్నట్టు సమాచారం. వారికి తాను ఏం చేయబోతోందో చెప్పనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News