: శశికళ వెంటే ఉంటున్న మేనల్లుడు దినకరన్!

జయలలిత తన పొయెస్ గార్డెన్ నివాసం నుంచి నాడు గెంటివేసిన వాళ్లలో శశికళతో పాటు ఆమె మేనల్లుడు టీటీవి దినకరన్, జయ బంధువులు కూడా ఉన్నారు. అయితే, శశికళను జయలలిత కనికరించడంతో మళ్లీ ఆమె గూటికే చేరింది. కానీ, దినకరన్, జయలలిత బంధువులకు మాత్రం పొయెస్ గార్డెన్ ఛాయలకు వెళ్లే అవకాశం లభించలేదు. అయితే, జయలలిత మృతి అనంతరం శశికళ మేనల్లుడు దినకరన్ ఆమె వెంటే ఉంటున్నాడు. తమిళనాట సంక్షోభం తలెత్తడానికి ముందు నుంచి ఇప్పటివరకు ఆమెతోనే కనిపిస్తున్నాడు. జయలలిత మరణానంతరం నిర్వహించిన అన్నాడీఎంకే అధికారిక సమావేశాల నుంచి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసేందుకు శశికళ వెళ్లినప్పుడూ దినకరన్ ఆమెతోనే ఉన్నాడు. అయితే, ఏం మాట్లాడకుండా, కేవలం మౌన ప్రేక్షకుడి గానే ఉంటున్న దినకరన్ పాత్రపై తమిళనాట చర్చించుకుంటున్నారు.

More Telugu News