demonitisation: బ్యాంకుల్లో న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితిని ఎత్తివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ

పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత న‌గ‌దు కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న బ్యాంకు ఖాతాదారుల‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త‌నందించింది. రెండు ద‌శ‌ల‌లో న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితిని క్రమంగా ఎత్తివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం బ్యాంకుల్లో పొదుపు ఖాతాల నుంచి న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితి 24 వేల రూపాయ‌లుగా ఉంది. ఈ ప‌రిమితిని ఈ నెల 20 నుంచి రూ.50,000కు పెంచుతున్న‌ట్లు తెలిపింది. ఇక మార్చి 13 నుంచి విత్ డ్రా ప‌రిమితిని పూర్తిగా ఎత్తివేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

More Telugu News