virat: హైద‌రాబాద్ లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ తోటి ఆటగాళ్లతో విరాట్ కోహ్లీ సెల్ఫీ

ఎల్లుండి నుంచి హైద‌రాబాద్‌, ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో టీమిండియా, బంగ్లాదేశ్ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీమిండియా ఆట‌గాళ్లు హైద‌రాబాదీ రుచుల‌ను చ‌విచూస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ హోట‌ల్‌లో త‌న తోటి ఆట‌గాళ్ల‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుండ‌గా హార్దిక్ పాండ్యా, జ‌యంత్ యాద‌వ్‌, కేఎల్ రాహుల్‌లతో క‌లిసి దిగిన ఓ సెల్ఫీని ఆయన సోష‌ల్ మీడియాలో ఉంచాడు. ‘గుడ్ స‌న్నీ డే ఇన్ హైద‌రాబాద్’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

More Telugu News