: తాగునీటి సమస్యపై ప్రశ్నించిన ప్రజలపై మండిపడ్డ ఏపీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే!

తాగునీటి సమస్యపై ప్రశ్నించిన ప్రజలపై ఏపీ ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లోని శాటిలైట్ సిటీలో చోటుచేసుకుంది. ఈ కాలనీలో సుమారు నాలుగు రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రిని, ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయడం జరిగింది. దీంతో, సహనం కోల్పోయిన చినరాజప్ప వారిపై కేకలు వేయగా, ‘తమాషా చేస్తున్నారా?’ అంటూ  బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అక్కడే ఉన్న ఎంపీ మురళీమోహన్ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

More Telugu News