: ఆ న్యాయమూర్తికి పిచ్చి పట్టింది... ఉగ్రవాదులకు మద్దతిస్తాడా?: ట్రంప్ నిప్పులు

కోర్టులు అడ్డంపడ్డా, తనలో దూకుడు తగ్గబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరూపించారు. ఇమిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై స్టే విధించిన సియాటెల్ న్యాయమూర్తి రాబర్ట్ ను పిచ్చోడిగా అభివర్ణించారు. ఆ జడ్జికి పిచ్చి పట్టిందని, అందుకే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాడని, ఆయనపై కేసు పెట్టి జైల్లో పెట్టాలని నిప్పులు చెరిగారు. ఎంతో మంది చెడ్డవారిని అమెరికాకు తీసుకువచ్చి ఇక్కడి ప్రజలకు శాంతి లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు.

రాబర్ట్ తీర్పు పట్ల ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఆయన తన భయంకరమైన తీర్పును సవరించుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, తనకు వ్యతిరేకంగా తీర్పు రావడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేక ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News