: దాసరి మాట్లాడుతున్నారు, ఇక భయం లేదు: మురళీమోహన్

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, శ్వాస సమస్యలతో కిమ్స్ లో చేరి చికిత్సను పొందుతున్న దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఉదయం ఆయన్ను పరామర్శించిన నటుడు మురళీమోహన్ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. దాసరి మాట్లాడుతున్నారని, ఆయనకు ఎలాంటి ప్రాణ భయమూ లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ తగ్గిందని, స్వయంగా ఊపిరి పీల్చుకుంటున్నారని, త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు దాసరిని షిఫ్ట్ చేయనున్నట్టు వెల్లడించారు.

More Telugu News