: రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: ఎమ్మెల్యే బొండా ఉమా

రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర బడ్జెట్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా అంటూ  వైఎస్సార్సీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఈ హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రతిపక్షాలు ఆలోచించాలని సూచించారు. ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినా ఏపీకి ప్యాకేజ్ ద్వారా అన్నింటినీ  కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఏపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

More Telugu News